PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ 26 కులాలను…‘బీసీ’లోనే  చేర్చండి..

1 min read

తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు

 హైదరాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో బీసీలుగా పరిగణింపబడే 26 కులాలను.. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించడం అన్యాయమని, ఆ కులాల వారిని మళ్లీ బీసీలోనే చేర్చాలని గురువారం బీజేపీ నేతలు తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు వినతిపత్రం అందజేశారు. బీసీ జాబితా నుంచి తొలగించడం వల్ల ఆ 26 కులాల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుందని గవర్నర్​కు వెల్లడించారు. ఈ సమస్యపై గవర్నర్​ సానుకూలంగా స్పందించారు. గవర్నర్​ను కలిసిన వారిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్​, ఏపీ శాసన మండలి సభ్యుడు మాధవ్​, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి తదితరులు ఉన్నారు.

About Author