NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్రిగోల్డ్ ఆస్తుల నుంచి ఆదాయం.. క‌మిటీ ఏర్పాటు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన జ‌ప్తు చేసిన ఆస్తుల నుంచి ఆదాయం రాబ‌ట్టడం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా ఆస్తుల్ని అద్దె, లీజుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎస్ అధ్యక్షత‌న అధీకృత క‌మిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ, సీసీఎల్ఏ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యద‌ర్శుల‌ను స‌భ్యులుగా, సీఐడీ అద‌న‌పు డీజీని క‌న్వీన‌ర్ గా నియ‌మించింది. జ‌ప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయం బాధిత డిపాజిట్ దారుల‌కు సంక్షేమానికి ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ మేర‌కు హాం శాఖ‌కార్యద‌ర్శి కుమార్ విశ్వజిత్ బుధ‌వారం ఉత్తర్వులు దాఖ‌లు చేశారు.

About Author