PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెరిగిన అమూల్ పాల ధర

1 min read

పల్లెవెలుగువెబ్ : అమూల్‌ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఈ మేరకు గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో మినహాయించి దేశవ్యాప్తంగా ఈ పెంపును వర్తింప చేసింది. ఫుల్‌ క్రీమ్‌, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు సంస్థ ఎండీ ఆర్‌ఎస్‌ సోథి పేర్కొన్నారు. డెయిరీ ఫ్యాట్‌ ధరలు బాగా పెరిగినట్లు ఎండీ వివరించారు. దీంతో మొన్నటి వరకూ లీటరు రూ.61 ఉండగా, తాజా పెంపుతో ధర రూ.63కు చేరింది. అమూల్‌ పాల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి.

          

About Author