PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని  77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రి ఆభరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలతో  నివాళులర్పించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని  77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆసుపత్రి లో జాతీయ జెండాను ఎగురవేసి ఆసుపత్రి సిబ్బందితో జాతీయ వందనం స్వీకరించి అనంతరం వైద్య సిబ్బంది మరియు ఇతర సిబ్బందికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆసుపత్రి లోని వైద్య అధ్యాపకులు మరియు ఇతర సిబ్బందికి ప్రశంసా పత్ర పత్రాలతో  బహూకరించినట్లు తెలిపారు.డా.సీతారామయ్య యూరాలజీ విభాగాధిపతి మరియు ఆంకాలజీ  విభాగాధిపతి డా.సి.ఎస్.ఆర్.కె ప్రకాష్, మరి ఇతర వైద్య సిబ్బంది తదితరులను ప్రశంస పత్రాలతో సత్కరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి  కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. ప్రభాకర్ రెడ్డి, CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీCSRMO, డా.హేమానలిని, RMO డా.వెంకటరమణ, వైద్యధ్యాపకులు డా.శ్రీహరి, డా.శ్రీనివాసులు డాక్టర్ సీతారామయ్య, డా.మాధవి శ్యామల, డా.రాధారాణి, డా.మాణిక్యరావు, డా.శివ ప్రసాద్ రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ మరియు ఆసుపత్రి ఏడి, శ్రీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి వెంకట తులసమ్మ , మరియు నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు  పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author