NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్య దినోత్సవం  

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి పట్టణంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవం  పురస్కరించుకొని పోలీసు స్టేషన్లో సిఐ శ్రీరాములు జెండాను ఆవిష్కరించారు, ఎంఆర్ఓ కార్యాలయంలో తాహాసిల్దర్ చంద్రశేఖర్ వర్మ, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ ఫజిల్ పాజుల్ రెహిమన్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ రాజారూపారాణి అధ్యక్షతన  జడ్పిటిసి బో రెడ్డి శ్రీరామి రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అలాగే మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి లక్ష్మీదేవి, వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ, ప్రభుత్వ కళాశాలలోనూ, సచివాలయాలలోనూ ప్రైవేటు పాఠశాలల్లోనూ, మువ్వెన్నల త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్న  స్వాతంత్య్రం,వారి త్యాగ ఫలాలను దేశం మరువ లేనిదని కొనియాడారు.

About Author