PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1947లో వ‌చ్చింది స్వాతంత్ర్యం కాదు.. భిక్ష !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ప్రముఖ న‌టి కంగ‌నార‌నౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1947లో వ‌చ్చింది స్వాతంత్ర్యం కాద‌ని, కేవ‌లం భిక్షేన‌ని ఆమె పేర్కొన్నారు. 2014లో వ‌చ్చింది నిజ‌మైన స్వాతంత్ర్యమ‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప‌లువురు రాజ‌కీయ‌నేత‌లు ఆమె వ్యాఖ్యల ప‌ట్ల అభ్యంత‌రం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సహా ప‌లువురు ఆమె వ్యాఖ్యల‌ను ఖండించారు. ఇటీవ‌లే ప‌ద్మశ్రీ స్వీక‌రించిన కంగ‌నా.. ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కంగ‌న వ్యాఖ్యలు దేశ‌ద్రోహం ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని అన్నారు. ఆమెకు ఇచ్చిన ప‌ద్మశ్రీ పుర‌స్కారాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

About Author