PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపడుతుంది

1 min read

దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలపాటి నరసింహామూర్తి

త్వరలో పార్టీ ప్రచారానికి మీ ముందుకు వస్తా..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపడుతుందని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహం మూర్తి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పెదవేగి మండలం ముండురు గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దెందులూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది  కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించబడిన వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మా వంతు కృషి, ప్రయత్నం చేయడంతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ఆమె సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం జరుగుతుందని, ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా విషయాన్ని మరచి వారి స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. దెందులూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా గెలుపునకు అన్ని సామాజిక వర్గాలతో ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానని ఆయన అన్నారు. త్వరలో పార్టీ ప్రచారానికి మీ ముందుకు వస్తానని తెలిపారు.

About Author