NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచానికి  యోగా ను పరిచయం చేసింది భారత దేశం

1 min read

– యోగ మానవుని వ్యక్తిత్వము ను సక్రమంగా ఉంచడమే కాకుండా, ఆరోగ్య పుష్టి ని కలుగ చేస్తుంది

 శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి KDCC చైర్మన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం నగరం లోని కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ SAP క్యాంపు నందు ఏర్పాటు చేసిన యోగ అవగాహన మరియు శిక్షణ కేంద్రం నకు ముఖ్య అతిధి గా KDCC చైర్మెన్ శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచము నకు యోగ ను పరిచయం చేసినది భారత దేశం అని, యోగ వాళ్ళ మన దైనందిన జీవితములో ఏర్పడే అనేక సమస్యల కు ఉపశమనం కలుగు తుంది అని, ఇటువంటి కార్యక్రమం ను చిన్నారుల కొఱకు ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు. దీన్ని చిన్నారులు ఉపయోగించుకొని జ్ఞానం తో పాటు మంచి ఆరోగ్యం ను పొందాలి అని కోరారు. కార్యక్రమం లో Dr మోక్షేశ్వర్ రెడ్డి , ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి   యోగ మాస్టర్ వెంకటేష్  వైఎస్ఆర్సిపి నాయకులు ధరణి ,ఇ తర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author