PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీలంక‌కు ఇండియా భారీ సాయం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్‌ తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. రాజపక్సే ప్రభుత్వం భారత్‌ను సాయం కోరిన నేపథ్యంలో 40 వేల టన్నుల ధాన్యాన్ని, డీజిల్‌ను శ్రీలంకకు ఇండియా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది. దీంతో శనివారం సాయంత్రం వరకు శ్రీలంక వ్యాప్తంగా డీజిల్‌ను సరఫరా చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

                              

About Author