PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియాకు వెళ్లేవారు జాగ్ర‌త్త‌గా ఉండండి : అమెరికా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భారత దేశానికి వెళ్లే తమ పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా హెచ్చరించింది. నేరాలు, ఉగ్రవాదం నేపథ్యంలో అప్రమత్తతకు సంబంధించిన సూచనలు చేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ ‘అంతర్జాతీయ ప్రయాణ సూచనలు’ను జారీ చేసింది. అందులో భారత్ కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్ ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారత దేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.

                                  

About Author