PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంగారుల పై గెలిచిన భార‌త్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ మెరుపులతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేయగా, దినేశ్ కార్తీక్ 2 బంతుల్లో 10 పరుగులు చేశాడు. టీమిండియా ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాదులో జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. గతరాత్రి కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా ఉండడంతో ఓవర్లను 20 నుంచి 8కి తగ్గించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది మాథ్యూ వేడ్ 43 (నాటౌట్), ఫించ్ 31 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు.

                                                         

About Author