PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో కొనసాగుతోన్న భార‌త బాక్స‌ర్ల హవా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌ పసిడి పంచ్‌ విసిరాడు. తాజాగా మహిళల 48-50 కేజీల లైట్‌ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ మరో స్వర్ణం సాధించింది.

                          

About Author