NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీపీఓ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

1 min read

– భారతరత్న డా బాబాసాహెబ్ అంబెడ్కర్ కి ఘన నివాళులు అర్పించిన సిబ్బంది

– ప్రతిజ్ఞ చేయించిన డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు   : భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో డీపీఓ కార్యాలయం సిబ్బంది భారత రాజ్యాంగ నిర్మాత డా అంబేడ్కర్, పూజ్య బాపూజీ చిత్ర పఠాలకు పూలమాలంకరించి ఘన నివాళులు అర్పించారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ దేశం కోసం అసువులు బాసిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికి గుర్తుంచు కోవాలని గుర్తు చేసారు.  భారతదేశం పుణ్యభూమని, ఈ కర్మభూమి  గడ్డ మీద పుట్టడం మనందరి అదృష్టమని భారత రాజ్యాంగ స్ఫూర్తిన కొనసాగిస్తూ భారతీయులుగా దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.  అంబేడ్కర్, పూలే, గాంధీజీ వంటి మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశిక వివరాలను చదివి డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

About Author