PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాకిస్థాన్ లో దిగిన భార‌త విమానం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మరో భారత విమానం సోమవారం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ చార్టర్డ్‌ విమానం మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ విమానం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే ఏ కారణంతో ఈ విమానం కరాచీ విమానాశ్రయంలో దిగిందన్నది స్పష్టంగా తెలియలేదు. కాగా నెల రోజుల్లో భారత విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగడం ఇది మూడోసారి.

                                         

About Author