PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా మిసైల్ దాడిలో భార‌త విద్యార్థి మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా ఎంతో మంది సామాన్య ప్ర‌జ‌లు విగ‌త‌జీవులుగా మారుతున్నారు. మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి మృతి గురించి కేంద్ర విదేశాంగ శాఖ తెలియజేశామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

                                        

About Author