PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ క్రికెట‌ర్ కూతురితో ఇండియ‌న్ టీమ్ ఫోటోలు.. ప్ర‌శంస‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారతీయ మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు క్రీడాస్ఫూర్తి చాటుకున్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు పాక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతురు ఫాతిమాతో భారతీయ క్రికెటర్లు సరదాగా గడిపారు. ఆరు నెలల వయసున్న ఆ బేబీని ఎత్తుకుని ఆడించారు. తనతో ఫొటోలు దిగి కాస్సేపు సంతోషంగా టైమ్ స్పెండ్ చేశారు. భారతీయ క్రికెటర్లు చేసిన ఈ పనిపై క్రీడాలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది.

                                        

About Author