PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త భూభాగాన్ని చైనాకు ఇచ్చారు : రాహుల్ గాంధీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎటువంటి పోరాటం లేకుండానే ఇచ్చేసిన ఈ భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్‌నాటికి ఉన్న స్థితిని పునరుద్ధరించాలని భారత దేశం చేసిన డిమాండ్‌ను చైనా తిరస్కరించిందని చెప్పారు. ఎంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారో ప్రభుత్వం చెప్పగలదా? అని బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రశ్నించారు.

                                                

About Author