PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆసియా క‌ప్ లో భార‌త్ భారీ విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భారత్ తన ప్రస్థానాన్ని భారీ విజయంతో ముగించింది. టోర్నీ సూపర్-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల సంచలన బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన వేళ, ఆఫ్ఘనిస్థాన్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం, 213 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చిందంటే అది ఇబ్రహీం జాద్రాన్ వల్లే. జాద్రాన్ 59 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముజీబ్ 18, రషీద్ ఖాన్ 15 పరుగులు చేశారు.

                                                      

About Author