PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెస్టిండీస్ పై ఇండియా ఘ‌న విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన 119 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలవగా, హర్మన్ ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది.

                                           

About Author