NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇందిరా పార్క్.. పెళ్లి కాని వారికి నో ప‌ర్మిష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇందిరా పార్క్ నిర్వాహ‌కులు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాని జంట‌ల‌కు ప‌ర్మిష‌న్ లేదంటూ బోర్డు పెట్టేశారు. దీంతో పెళ్లికాని జంట‌లు ఖంగుతున్నాయి. ఇందిరా పార్క్ నిర్వాహ‌కుల తీరు పై స‌ర్వత్రా విమ‌ర్శలు వెల్లువెత్తాయి. మ‌నం ఇండియాలో ఉన్నామ‌ని, తాలిబ‌న్ల పాల‌న‌లో కాద‌ని సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది. ప‌లువురు ఉద్యమకారులు పార్కు నిర్వాహ‌కుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో పార్క్ నిర్వాహ‌కులు త‌మ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకున్నారు. క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామంటూ ప్రక‌టించారు. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

About Author