PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి నియామకం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన  తెలంగాణ రాష్ట్ర మలకపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలిచి బాధ్యతలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల మన్ననలను  పొంది భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు త్రిపుర గవర్నర్గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డిని భారతీయ జనతా పార్టీ జాతీయ మైనార్టీ మోర్చా  కార్యవర్గ సభ్యురాలు తెలంగాణ మైనార్టీ మోర్చా ఇన్చార్జి షబానా మొమిన్  స్వగృహంలో కలిసి వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన త్రిపుర సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సహకరించాలని కోరారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం దేశంలోని మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బిజెపి మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ డాక్టర్ ఐజాక్ రాజ్ కూడా పాల్గొన్నారు.

About Author