PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి ప్రభుత్వంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి

1 min read

– ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: వైసిపి ప్రభుత్వంలో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా శనివారం బాబు షూరిటీ – భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం ప్యాపిలి పట్టణం , 4వ వార్డు నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  టిడిపి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అదేవిధంగా వైసిపి పాలనలో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని , గత టిడిపి ప్రభుత్వంలో ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి పట్టణ టిడిపి అధ్యక్షులు భూశెట్టి సుంకయ్య , నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ , పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి , పెద్దాపూజర్ల ప్రసాద్ రెడ్డి ,పోతిరెడ్డి రజని , నంద్యాల జిల్లా మైనారిటీ కమిటి ప్రధాన కార్యదర్శి ఖాజా పీరా , బీసీ సెల్ కమిటీ నాయకులు నాగేంద్ర , గండికోట రామాంజినేయులు ,మల్లికార్జున, కొంగనపల్లి మధు , బాలిరెడ్డి ,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author