PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతలో దారుణం.. దారి కాచి వైసీపీ కార్య‌క‌ర్త‌ను .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లాలో వైసీపీ కార్యకర్త శ్రీధర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం వెళ్తున్న శ్రీధర్‌ను కాల్వపల్లి సమీపంలో దారికాచి ప్రత్యర్థులు హత్య చేశారు. కాగా… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రత్యర్ధులు యత్నించారు. శ్రీధర్ స్వగ్రామం ఉరవకొండ మండలం షేక్షానుపల్లి. శ్రీధర్ తండ్రి లింగన్న షేక్షానుపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. గతంలో ఓ హత్య కేసులో శ్రీధర్ నిందితుడిగా ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే శ్రీధర్ కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

                            

About Author