NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప‌లో అమానుషం.. బైక్ పై తీసుకెళ్లి.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అమానుష ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారం చేశాడు. ప్రొద్దుటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న యువతిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినిని బైక్‎పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలుపగా… వెంటనే వారు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

                          

About Author