PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీఆర్సీ కోసం ఎమ్మెల్సీల దీక్ష !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పీఆర్సీ అంశం పై పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సిద్ధ‌మ‌య్యారు. ఈ అంశంలో న్యాయం కోరుతూ విజయవాడలో ఈ నెల 4వ తేదీన ఏడుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఒకరోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పీఆర్‌సీ స్ట్రగుల్‌ కమిటీ ఉద్యమాన్ని విరమించడాన్ని విభేదిస్తూ ఉపాధ్యాయ సంఘా లు ఐక్య కూటమి దిశగా కదిలాయి. ఇటీవలే తొలి దశ ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలకు మద్దతు పలికి దీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష లో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా పాలు పంచుకోనున్నాయి.

                              

About Author