PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా కేంద్రాలు తనిఖీ

1 min read

– పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించిన, కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కళాశాలల పరీక్ష కేంద్రాలను, పరీక్ష జరుగుతున్న తీరును కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు పరిశీలించారు.ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్ధులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పరీక్ష కేంద్రాలలో 22 వేల 630 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యరన్నారు. ( పురుష అభ్యర్థులు 18,117 , మహిళా అభ్యర్ధులు 4,513 ).అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.మాల్ ప్రాక్టిస్ లేకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు. కర్నూలు రేంజ్ డిఐజి గారి వెంట కోర్టు మానిటరింగ్ సిఐ రామయ్య నాయుడు ఉన్నారు.

About Author