PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు నేడు పనులు తనిఖీ.. మొక్క నాటిన ఎంఈఓ

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: గడిగరేవుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు – నేడు పనుల పరిశీలనలో భాగంగా గురువారం నాడు మండల విద్యాధికారి రామకృష్ణుడు అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పనులలో నాణ్యత పాటించాలని ఆదేశించారు పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాలను పచ్చదనంతో నింపటంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని అపుడే విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనార్జిస్తారని తెలియజేశారు.

About Author