PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయండి

1 min read

– కౌన్సిలర్ బోయ జయమ్మ..4వ వార్డులో పర్యటించిన కమీషనర్.
6 సమస్యలు పరిష్కరిస్తామని హామీ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలోని 4 వ వార్డులో డ్రైనేజీ సమస్య నెలకొందని డ్రైనేజీ కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ బోయ జయమ్మ మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్ ను కోరారు.మంగళవారం మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ 4వ వార్డు లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆ వార్డులోని సమస్యలను కౌన్సిలర్ బోయ జయమ్మ ను అడిగి తెలుసుకున్నారు.ప్రధానంగా డ్రైనేజి సమస్యల గురించి కమీషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు ,మురుగునీరు రోడ్లపై నిలిచి దుర్వాసన వస్తుందని తెలిపారు.ఎన్నో ఏళ్ళుగా కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన డ్రైనేజి సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. కమిషనర్ స్పందిస్తూ వార్డులో ఒక్క కాలువ లేకపోవడం చాలా బాధాకరమని తప్పకుండ నూతన డ్రైనేజి కాలువలు ఏర్పాటు చేస్తామని సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో చర్చించి వార్డులోని అన్ని సమస్యలకు తప్పకుండా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జ్ బోయ శేఖర్ ,తదితరులు పాల్గొన్నారు.

About Author