PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని కుటుంబానికి భీమా నగదు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలో గ్రామానికి చెందిన సంజామల సలీం భాష(46)13వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు సహజ మరణం మృతి చెందారని ఈయన గత కొన్ని రోజుల నుండి అనారోగ్య కారణాల వల్ల చికిత్స తీసుకుంటూ ఉన్నారని ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.మంగళవారం ఉదయం వైఎస్ఆర్ బీమా నగదు పదివేల రూపాయలను నామినీ అయిన మృతుని భార్య  సంజామల జమాల్ భీ కి నగదును గ్రామ సర్పంచ్ విద్యా పోగుల జయలక్ష్మమ్మ, ఉప సర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి నగదును అందజేశారు.మృతునికి ఇద్దరు కుమారులు ఖాసిం సాహెబ్(23)బీటెక్, మస్తాన్(19)డిగ్రీ చదువుతున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవమ్మ,పంచాయతీ కార్యదర్శి సుధీర్,కేశావతి,వెల్ఫేర్ అసిస్టెంట్ డి.మధు తదితరులు పాల్గొన్నారు.

About Author