PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 ఏళ్ల పాటు వ‌డ్డీలేని రుణం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రాష్ట్రాల‌కు మూల‌ధ‌న వ్యయం కింద 15 వేల కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. 50 ఏళ్ల పాటు వ‌డ్డీ లేని రుణం 15 వేల కోట్ల అద‌న‌పు మొత్తాన్ని స‌మ‌కూరుస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేర‌కు ఆర్థిక స‌హాయం పేరుతో 2021-22 సంవ‌త్సరాల‌కు మార్గద‌ర్శకాలు విడుద‌ల చేసింది. గ‌త సంవ‌త్సరం క‌రోన కాలంలో మూల‌ధ‌న వ్యయానికి ఇది స‌హాయ‌ప‌డింది. ఈ ప‌థ‌కానికి వ‌చ్చిన స్పంద‌న చూసి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ‌చ్చిన విజ్ఞప్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌నున్నట్టు కేంద్రం తెలిపింది.

About Author