NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమ శకుంతలకు ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు

1 min read

పల్లెవెలుగ వెబ్ కర్నూలు: రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ex ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్,వైస్సార్సీపీ నాయకురాలు రాయలసీమ శకుంతల చేస్తున్న…. సామాజిక సేవలకు గాను, కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు కే.చక్రవర్తి గారు రాయలసీమ శకుంతల కు సేవా రంగంలో అందించే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2023 ని అందించారు. ఈ సందర్భంగా రాయలసీమ శకుంతల మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి సామాజిక సేవలో పాల్గొంటూ… నిరాశ్రయులకు, ఆడవాళ్లకు, వృద్ధులకు,మరియు భర్త, అత్తా వేధింపులతో వచ్చిన మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వడం. ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ.. వారికి ప్రభుత్వ నుండి వచ్చే పథకాలను వారికి తెలియజేసి ఇప్పించడం. నేను చేసే సేవలకు చాలా అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డుకు ఎంపిక చేసిన మనం ఫౌండేషన్ చక్రవర్తి గారికి ధన్యవాదములు తెలుపుతూ… ఇలాంటి అవార్డులతో ఇంకా ఉత్సాహంతో పనిచేసి అందరి సహాయ సహకారాలతో మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

About Author