NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకీయాల్లోకి.. దేశంలోనే అతిపొడగరి !

1 min read

పల్లెవెలుగువెబ్ : దేశంలోనే అతిపొడగరిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు. ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్లు తక్కువ. సమాజ్‌వాదీ పార్టీలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాకను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ స్వాగతించారు. ఎన్నికల ముందు ఆయన పార్టీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వం నచ్చి ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు. కాగా, తన ఎత్తే తనకు సెలబ్రెటీ హోదా, పేరు తెచ్చిందని ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.

      

About Author