PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్వామా పీడీ..‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులు స్వతంత్రంగా  వార్తలు రాయాలని ఆకాంక్షించారు ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్​ అమర్నాథ్​ రెడ్డి. బుధవారం కర్నూలు కలెక్టరేట్​లోని డ్వామా కార్యాలయంలో పల్లెవెలుగు దినపత్రిక క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీ అమర్నాథ్​ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించే దిశగా వార్తలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీడీ( వాటర్​ షెడ్​) సలీంబాష, సీనియర్​ అసిస్టెంట్​జగదీశ్వరయ్య,  సూపరింటెండెంట్​ వీర ప్రతాప్​ తదితరులు పాల్గొన్నారు.

About Author