PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోజుకు 200 పెట్టుబ‌డి పెట్టండి.. 28 ల‌క్షలు పొందండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కొత్త పాల‌సీని అందుబాటులోకి తెచ్చింది. సుర‌క్షిత‌మైన రాబ‌డి కోసం పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారికి ఇది బాగా ఉప‌యోగ‌పడుతుంది. ఎల్ఐసీ తీసుకొచ్చిన పాల‌సీల్లో జీవ‌న్ ప్రగ‌తి పాల‌సీ ఒక‌టి. ఈ పాల‌సీ ప్రకారం రోజుకు 200 రూపాయాలు.. అంటే నెల‌కు 6000 రూపాయ‌లు పెట్టుబ‌డి పెడితే పాల‌సీ మెచ్యూరిటీ అయ్యే స‌రికి ఆ డ‌బ్బు 28 ల‌క్షలు అవుతుంది. ఈ పాల‌సీని ఐఆర్డీఏఐ ఆమోదించింది. పెట్టుబ‌డిదారుడు క‌నుక పాల‌సీ మెచ్యూరిటీ తీర‌క ముందే చ‌నిపోతే.. ఆ డ‌బ్బు మొత్తం నామినీకి క్రెడిట్ అవుతుంది. పాల‌సీ తీసుకున్న ఐదు సంవ‌త్సరాల‌లోపు పెట్టుబ‌డిదారుడు మ‌ర‌ణిస్తే 100 శాతం బీమా వ‌ర్తిస్తుంది. ఈ పాల‌సీలో పెట్టుబ‌డి పెట్టడానికి గ‌రిష్ట వ‌యోప‌రిమితి 45 సంవ‌త్సరాలు. 20 ఏళ్ల త‌ర్వాత 28 ల‌క్షలు పొందాలంటే 14 ల‌క్షల‌కు పాల‌సీ తీసుకుంటే మంచిది.

About Author