PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంఫిల్​, పీహెచ్​డీ గిరిజన విద్యార్థుల నుంచి స్కాలర్​షిప్​ దరఖాస్తుల ఆహ్వానం!

1 min read

పల్లెవెలుగువెబ్​, అనంతపురం: 2021​–22విద్యాసంవత్సరం ఎంఫీల్​, పీహెచ్​డీ గిరిజన విద్యార్థుల నుంచి జాతీయ ఫెలోషిప్​, స్కాలర్​షిప్​ పథకం కింద స్కాలర్​షిప్​ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి అన్నాదొర గురువారం ప్రకటించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరిందన్నారు. https://fellow.tribal.gov.in, www.scholarship.gov.in వెబ్​సైట్ల ద్వారా అర్హత ప్రమాణాలు, సూచనల ప్రకారం నవంబరు 30వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్​నెం.08554–246151 కు సంప్రదించాలని కోరారు.

About Author