NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ బియ్యం ,కర్ణాటక మద్యం అక్రమాలను అరికట్టాలి… సిపిఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మినూరు పట్టణంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం , కర్ణాటక అక్రమ మద్యాన్ని అరికట్టాలని  సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ  డివిజన్ కార్యదర్శి డిమాండ్ చేశారు.  బుధవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ మోహన్ రెడ్డి కి ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని  గ్రామీణ ప్రాంతాల్లో  పిడిఎస్ రైస్ ను విచ్చలవిడిగా ప్రజల నుండి తక్కువ ధరలకు విక్రాయించి వేరే రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వారు అన్నారు. అదేవిదంగా కర్ణాటక మద్యం పై పట్టణ మరియు గ్రామీణ ప్రాంత లలో అధికార పార్టీ నాయకులు జోరుగా అమ్ముతున్న చూసి చూడనట్లు ఉండడం దారుణం అన్నారు. కావున ఇప్పటికైనా తమరు స్పందించి రేషన్ బియ్యం,  కర్ణాటక మద్యంపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు,ఏఐకేఎంఎస్ నాయకులు ఏసేపు,నాయకులు బజారి, ఆగస్టిన్,తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author