PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదవులతో సంబంధం లేకుండా జగనన్న వెంటే నడుస్తా

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవకు మండలం పదవీ ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారి ఆశయం.ఆయన ఆశయాలకు అనుగుణంగానే పదవులతో సంబంధం లేకుండా జగనన్న వెంటే నడుస్తా.నా భర్త చల్లా భగీరథ‌రెడ్డి అకాల మరణం చెందిన వేళ జగనన్న నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం నేను మరువలేనిది. 2019 ఎన్నికల తరువాత మా కుటుంబ పెద్ద చల్లా రామకృష్ణా‌రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. అనారోగ్యంతో ఆయన మరణిస్తే, ఆ స్థానంలో నా భర్త చల్లా భగీరథ‌రెడ్డి గారిని ఎమ్మెల్సీగా కూర్చోబెట్టారు.ఇలా రెండు సార్లు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడమే కాకుండా మా కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన జగనన్నకు, వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటాను.నా ప్రాణం ఉండగా జగన్నన్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం కానీ.. తప్పు పట్టడం కానీ జరగదు.చల్లా కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు విజ్ఞప్తి.పదవులు కాదు ప్రజాసేవ నే ముఖ్యం.చల్లా కుటుంబానికి తాజా ఎమ్మెల్సీ పదవుల్లో అవకాశం ఇవ్వలేదని చల్లా కుటుంబ అభిమానులు, కార్యకర్తలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారని నా దృష్టికి వచ్చింది.ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనందరం కష్టపడి మరోసారి జగనన్నను అధికారంలోకి తీస్కొని రావడానికి కృషి చేద్దాం.. ఇప్పటినుంచే ఆ దిశగా అడుగేద్దాం.. ఎమ్మెల్సీ పదవుల విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదు.. ఇప్పటికీ, ఎప్పటికీ జగనన్న సైన్యంలో నేను ఒక సభ్యురాలుగానే ఉంటానని మాటిస్తున్నా.. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రజలకు సేవ చేసుకునే ఎన్నొ అవకాశాలనీ భవిష్యత్తులో జగనన్న కల్పిస్తారని ఆశిస్తూ.

About Author