PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ దేశ‌ద్రోహం త‌యారు చేసే ఫ్యాక్టరీనా ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కేసీఆర్ మ‌రోసారి బీజేపీ పై విరుచుకుప‌డ్డారు. తనను దేశద్రోహి అన్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులు కాదు. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా మేము దేశద్రోహులు కాదు. కానీ ఇప్పుడు దేశద్రోహులు అయ్యాం. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు. అంటే బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా? ఇది బీజేపీ స్టయిల్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని నిలదీసినా వాళ్లు దేశద్రోహులు అయిపోతారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుంది. ఒకటి దేశద్రోహులు. రెండు అర్బన్ నక్సల్స్. ఇంకా గట్టిగా మట్లాడితే అర్బన్ నక్సల్స్ స్టాంప్ వేస్తారు.’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

About Author