PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైగ‌ర్` సినిమాకు కేసీఆర్ కూతురు పెట్టుబ‌డి పెట్టారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టి‌ఆర్‌ఎస్ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కుమార్తె కవిత.. మొన్న విడుదలై ప్లాప్ అయిన ‘లైగర్’ సినిమాకి పెట్టుబడి పెట్టారనేది వైరల్ అవుతున్న వార్త. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఆ ‘లైగర్’ సినిమాకైతే అంత సీన్ లేదనే అంటున్నారు. పూరి జగన్, చార్మీలతో సహా కొందరు హిందీ ప్రముఖులు ఆ సినిమాలో పెట్టుబడి పెట్టారు. ఒక్క మైక్ టైసన్‌ కే ఎక్కువ పారితోషికం అంటే సుమారు 20 కోట్లు ఇచ్చారు. అంతే.. ఆ సినిమాకి మరీ అంత ఎక్కువ బడ్జెట్ అవదని అంటున్నారు. ఎందుకంటే సెకండాఫ్ సినిమా అంతా ఒక బాక్సింగ్ రింగ్ లాంటి సెట్‌లోనే తీశారు. పారితోషికాలు తప్పితే సినిమాకి ఏమి పెట్టలేదు పూరి జగన్ అని కూడా అంటున్నారు. మహా అయితే ఈ సినిమాకి బడ్జెట్ 50 నుంచి 60 కోట్ల వరకు అయి ఉంటుంది అని అంచనా. అందువల్ల కవిత ఇందులో ఎంత పెట్టుబడి పెట్టారు అన్నది ఎంతవరకు నిజమో తెలియదు. ఆమె డైరెక్ట్‌గా ఒక సినిమా తీసే వీలున్నప్పుడు ఈ ‘లైగర్’ సినిమాలో పలువురు నిర్మాతలతో క‌లిసి ఎందుకు పెట్టుబ‌డి పెడ‌తార‌నే ప్ర‌శ్న వినిపిస్తోంది.

                                               `

About Author