PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం నోరు మూగబోయిందా….!

1 min read
మాట్లాడుతున్న సత్య సాయినాథ్ శర్మ

మాట్లాడుతున్న సత్య సాయినాథ్ శర్మ

– తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకుంటున్నా స్పందించక పోవడం సిగ్గుచేటు
– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్​, కమలాపురం : ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న కోవిడ్ సంబంధిత అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటున్నా… వైసీపీ ప్రభుత్వం, కేబినెట్​ మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ. కమలాపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్​కు వెళ్లే కోవిడ్​ రోగులు పరిస్థితిని రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యక్షంగా చూశామన్న సాయినాథ్ శర్మ.. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంతృత్వంలో ఉన్నామా… అనే ఆలోచన కలుగుతుందన్నారు. కర్నూలు వద్ద ఆక్సిజన్ అందక రోగుల ఆర్తనాదాలు చూస్తుంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఈ విషయంపై ఎందుకు చర్చింకుండా ఉందని ఘాటుగా ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే.. వెంటనే కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వం… ప్రజల ఆరోగ్యంపై ఎందుకు దృష్టిసారించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ సీఎం కేసీఆర్​, కేటీఆర్​, టీఎస్​ మంత్రులు ఆంధ్రప్రదేశ్​లోకి అడుగు పెట్టకుండా.. వెంటనే నిషేదాజ్ఞలు జారీ చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఏపీ ప్రభుత్వం స్పందించి హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి .. భవిష్యత్​లో ఇలాంటి సమస్య రాకుండా చేయాలని కోరారు. సమావేశంలో, తెలుగుదేశం నాయకుడు బన్నూరు శ్రీధర్ సోషల్ మీడియా ఇంచార్జ్ కొండ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author