NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైనా అధ్య‌క్షుడిని గృహ నిర్బంధం చేశారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఆయనను రాజధాని బీజింగ్‌లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జిన్‌ పింగ్‌ను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చీఫ్‌గానూ తొలగించారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున విమానాల రద్దు.. బీజింగ్‌లో భారీ సైనిక బందోబస్తు వీటికి మరింత ఆజ్యం పోశాయి. ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్సీవో) సదస్సులో పాల్గొని స్వదేశానికి ఈ నెల 16న తిరిగొచ్చిన జిన్‌ పింగ్‌ను విమానాశ్రయంలోనే పీఎల్‌ఏ అదుపులోకి తీసుకున్నదని.. అనంతరం గృహ నిర్బంధం చేసిందని కథనాలు వస్తున్నాయి. వీటిని పేర్కొంటూ.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేయడం మరింత సంచలనమైంది. అయితే, వీటిని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ధ్రువీకరించలేదు.

                                                          

About Author