NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌న్ను పొడిచినా స్టేష‌న్ బెయిలా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్, నినాదాలకే హత్యాయత్నం కేసు. ఇలాంటి పోకడలతో పోలీసులు తాము ఎటువైపో స్పష్టం చేశారు?. కుప్పంలో సాధారణ నిరసన తెలిపినవారిపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్ పెట్టి రిమాండ్‌కు పంపారు. విజయవాడలో కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీల తీరు పోలీస్ శాఖ ప్రతిష్ఠకే మాయనిమచ్చ. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు సాగిలపడటాన్ని ప్రజలు సమర్థించరు, ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్నది నిందితులను రక్షించడానికి కాదని పోలీసులు గుర్తించాలి’’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

                                          

About Author