PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట మీద నిల‌బ‌డే మ‌గ‌త‌నం లేదా ? : వైఎస్ ష‌ర్మిల‌

1 min read

పల్లెవెలుగు వెబ్​ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం పెత్తనం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆఖరి గింజ వరకూ నేనే కొంటానని చెప్పిన కేసీఆర్‌.. మాట మీద నిలబడే మగతనం లేదా? మీరు మొనగాళ్లు కాదా..? అంటూ విరుచుకుప‌డ్డారు. పంట పండాక కొనను అంటే రైతులంతా ఏమైపోవాలి? రైతులను బజారున పడేసినట్లు కాదా? అని విమ‌ర్శించారు. వరి వద్దని చెప్పడానికేనా మిమ్మల్ని సీఎంను చేసింది? అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 21వ రోజు మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు.

About Author