PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేమన కంటే వైఎస్ గొప్పొడా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : కడప యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి వేమనను అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడారు. జగన్ రెడ్డి విధ్వంసక పాలన ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై అనేక కొత్త పుంతలు త్రొక్కుతూ పరాకాష్ఠకు చేరిందని అన్నారు. “దీని ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజాకవి వేమన కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవాడా? వేమన తన జీవితం మొత్తం ప్రజలలో తిరుగుతూ మూఢనమ్మకాలపై, విలువలపై, కుల వివక్షలపై చైతన్యం తీసుకొచ్చిన గొప్ప కవి. వేమన తెలుగుజాతికి మంచి సాహిత్యాన్ని అందించిన ఒక రత్నంలాంటివాడని“ అన్నారు.

About Author