PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టికెట్ రేట్లు పెంచాల‌న‌డం దోచుకోవ‌డం కాదా?

1 min read

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమ‌ర్శ
ప‌ల్లెవెలుగు వెబ్: వ‌కీల్ సాబ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవాల‌ని చూడ‌టం అభిమానుల్ని దోచుకోవ‌డం కాదా? అని ప్రశ్నించారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుని కూడ ఇంకా దోచుకోవాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ సిబ్బందికి క‌రోన వ‌చ్చింద‌ని ఆయ‌న క్వారంటైన్ లో ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా సీఎం జ‌గ‌న్ తిరుప‌తి స‌భ ర‌ద్దు చేసుకున్నారు. ప‌వ‌న్ చేసింది మాత్రం టీడీపీకి క‌రెక్టుగా క‌నిపిస్తుంద‌ని ఎద్దేవా చేశారు . తిరుప‌తిలో వైసీపీ విజ‌యం త‌థ్యమ‌న్న మంత్రి.. ల‌క్షల్లో మెజార్టీ సాధిస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు. పెద్ది రెడ్డి స‌వాల్ విసిరి 24 గంట‌లైనా టీడీపీ నుంచి స్పంద‌న రాలేద‌ని అన్నారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కుమ్మక్కయ్యాయ‌ని పేర్కొన్నారు. బీజేపీ మ‌త రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

About Author