PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఆపాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపాలని పాలస్తీనా పై జరుగుతున్న దురాక్రమణ పై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పుస్తకం విడుదల చేయడం జరిగింది పుస్తకం విడుదల చేసిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శిబి గిడ్డయ్య జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శికామ్రేడ్ కే జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి సిపిఐ నాయకులు చంద్రశేఖర్ వెంకటేష్ నాగరాజు శివ అమినాబి శ్రీనివాసులు పుస్తకం విడుదల చేసిన వారిలో ఉన్నారు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య  మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనా పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని గగ్గోలు పెడుతున్న ఐక్యరాజ్యసమితి తక్షణమే యుద్ధం ఆపాలని చెప్పినప్పటికీ అమెరికా అండతో ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా పసి పిల్లలని కూడా చూడకుండా దాడులు చేస్తూ హాస్పిటల్లపైన బాంబుల వర్షాలు కురిపిస్తూ పాలస్తీనాన్ని ఘాజా నగరాన్ని స్మశాన వాటిక గా మార్చిన చరిత్ర అమెరికా కాదని ప్రపంచ దేశాల లో ఏదో ఒక దేశం యుద్ధాలు చేయకపోతే అమెరికా దేశం కి మనుగడ ఉండదు  అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది కనుక ఎప్పుడూ ఏదో ఒక దేశానికి గొడవలు పెట్టి అమెరికాలో తయారయ్యే మందు గుండు సామాగ్రిని అమ్ముకొని జీవనం కొనసాగిస్తుంది అమెరికా ప్రపంచ పటంలోనే లేనటువంటి ఇజ్రాయిల్ దేశం ఆనాడు పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ యూదులకు అవకాశం కల్పించడం ద్వారా ఈరోజు ఆశ్రయం కల్పించిన వారిపైనే దాడులు చేస్తూ ఆ దేశ ని నామరూపాలు లేకుండా చేయడానికి అమెరికా కుట్రలో భాగంగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు అమెరికా కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తక్షణమే ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలని పాలస్తీనా గాజా ప్రజల ఆకలి దప్పుల నుండి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

About Author