PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీడియా సంస్థల‌పై ఐటీ దాడి.. క‌క్ష సాధింపే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దైనిక్ భాస్కర్, భార‌త్ స‌మాచార్ మీడియా సంస్థల‌కు చెందిన ప‌లు ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్పడ్డాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఈ సోదాలు నిర్వహించారు. జైపూర్, అహ్మదాబాద్, నోయిడా స‌హా ప‌లుచోట్ల దైనిక్ భాస్కర్ కార్యాల‌యాల్లో ఐటీ సోదాలు చేప‌ట్టింది. దీనిపై ప్రతిప‌క్షాలు మండిప‌డ్డాయి. క‌రోన క‌ష్టాలు, మ‌హ‌మ్మారి నిర్వహ‌ణ‌లో ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు చూపినందుకే మీడియా సంస్థల‌పై కేంద్ర ప్రభుత్వం క‌క్ష సాధింపు చ‌ర్యల‌కు పాల్పడుతోంద‌ని ప్రతిప‌క్షాలు విమ‌ర్శించాయి. ఈ విమ‌ర్శల‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభుత్వం సంస్థలు వాటి ప‌ని అవి చేసుకుంటున్నాయ‌ని, ఇందులో త‌మ ప్రమేయం లేద‌ని తేల్చిచెప్పింది. కేవలం మీడియా ఆర్థిక వ్యవ‌హారాల‌పైనే దృష్టి పెట్టామ‌ని , రాజ‌కీయాల‌తో త‌మ‌కు సంబంధంలేద‌ని ఐటీ శాఖ పేర్కొంది.

About Author