PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోనూసూద్‌ను భయపెట్టడానికే ఐటీ దాడులు: కేటీఆర్

1 min read

పల్లెవెలుగు వెబ్: సినీ నటుడు సోనూసూద్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలు అమోఘమన్నారు. నిస్వార్థపూరితంగా సేవ చేశారని కొనియాడారు. హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌ సన్మానం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్, సోనూసూద్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ… సమాజంలో సవాళ్లు ఎదురైన‌ప్పుడు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులూ చేయడం సాధ్యం కాద‌న్నారు. సోష‌ల్ మీడియాలో విమర్శలు చేయడం సులభమని..అదే బాధ్యతగా సేవలు చేయడం గొప్ప విషమన్నారు. సోనూసూద్‌ను భయపెట్టడానికి అతని ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించారని కేటీఆర్ ఆరోపించారు. కానీ తామంతా సోనూసూద్‌కు అండగా ఉన్నామని కేటీఆర్ అన్నారు.

About Author