NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌తంలో అనేక సార్లు జ‌రిగాయి.. ఇప్పుడు టీడీపీ రాజ‌కీయం చేస్తోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌ంగారెడ్డి గూడెం క‌ల్తీ మ‌ద్యం మ‌ర‌ణాల‌పై సీఎం జ‌గ‌న్ స్పందించారు. సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కల్తీ మద్యం మరణాలు గతంలో కూడా అనేక సార్లు జరిగాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా ఎత్తేశామని చెప్పారు. లాభాపేక్షతోనే గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలపై పూర్తి నియంత్రణ విధిస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల సూచనల మేరకు మద్యం ధరలు తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు.

                            

About Author