NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డూండీ రాకేష్ పై సీఐ చేయి చేసుకోవటం దుర్మార్గం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గంగాధర నెల్లూరు లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్ పై CI చేయి చేసుకోవటం దుర్మార్గం. దీనిని నెల్లూరు పార్లమెంటు వానిజ విభాగం పూర్తిగా ఖండిస్తుంది వెంటనే ఆ సీఐ మీద యాక్షన్ తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం. సిఐ గారు వైసీపీ నాయకుల్లా ప్రవర్తించడం బాధాకరం .ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకుంటారు సభలు పెట్టుకుంటారు అంతే కానీ ఈ విధమైన దౌర్జన్యం చేయడం, చేయి చేసుకోవటం ఇది ప్రజాస్వామ్య నికి విరుద్ధంగా చేస్తున్నారు. ఇది సరి కాదని చెప్పి నెల్లూరు పార్లమెంటు వాణిజ్యవిభాగం ఖండిస్తుంది. నారా లోకేష్ గారి యువ గలం పాదయాత్ర ని చూసి అక్కడకు వచ్చే ప్రజలు కార్యకర్తలను చూసి ఓర్వలేక అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం. ఈ విధంగా పోలీసు వారు కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని బెదిరించడం ఇది మీలో ఉండే భయాన్ని సూచిస్తుంది. ఈ విధమైన చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. వెంటనే ఆ సీఐ గారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.

About Author